బీజింగ్, మే 23: చైనా కమ్యూనిస్టు పార్టీ అధికార పత్రిక పీపుల్స్ డైలీ మొదటి పేజీల్లో ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్కు సంబంధించిన వార్తలు గత కొద్దిరోజులుగా కనిపించట్లేదు. దీంతో పార్టీపై ఆయన పట్టు కోల్పోతున్నారని, ప్రధాని లీ కెకియాంగ్ పట్టు సాధిస్తున్నారని పలువురు విశ్లేషిస్తున్నారు.
జిన్పింగ్ ఆర్థిక, కొవిడ్ పాలసీలు పార్టీలోని ఉన్నత స్థాయి నేతలకు నచ్చట్లేదని, పాలసీలను వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని, అందుకే పత్రికలో ఆయన వార్తలు రాకపోవడానికి కారణం కావొచ్చని చెబుతున్నారు. కెకియాంగ్ వార్తలకు ప్రాధాన్యం కూడా అందుకే ఇస్తున్నారని భావిస్తున్నారు. పైగా జిన్పింగ్కు, కెకియాంగ్కు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయని పేర్కొంటున్నారు.