రష్యా- ఉక్రెయిన్ విషయంలో భారత ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలపై జపాన్ ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ వ్యవహారాల్లో ప్రతీ ఒక్క దేశం వారి వారి సొంత నిర్ణయాలు తీసుకునే ఆస్కారం వుంటుందని తేల్చి చెప్పారు. చారిత్రక పరిణామాలు, భౌగోళిక పరిణామాలకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకునే పూర్తి స్వేచ్ఛ వుంటుందని క్వాడ్ సమ్మిట్ వేదికగా పేర్కొన్నారు.
కొన్ని కొన్ని నిర్ణయాలు, విధానాలతో ఏకీభవించే మిత్ర దేశాలు ఆ దేశం తీసుకున్న నిర్ణయాలతో ఏకీభవించకపోవచ్చు కానీ.. పూర్తి స్వతంత్రంగా వ్యవహరించే ఛాన్స్ మాత్రం వుంటుందని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. అయినా సరే.. క్వాడ్ దేశాల మధ్య సత్సంబంధాలు మాత్రం కొనసాగుతూనే వుంటాయని జపాన్ ప్రధాని ఫ్యుమియో కిషిదా స్పష్టం చేశారు.
సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత, చట్టాల విషయంలో మాత్రం ఏ దేశమూ ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదన్న నిర్ణయాన్ని బలంగా వినిపించామని, అందరు దేశాధినేతలూ ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారని జపాన్ ప్రధాని ఫ్యుమియో వెల్లడించారు.