టోక్యో, జూన్ 28: ఆసియా దేశాల సంస్కృతి, వారసత్వాన్ని పాశ్చాత్య దేశాలకు పరిచయం చేయడంలో కీలక పాత్ర పోషించే వారికిచ్చే ప్రఖ్యాత ‘ఫుకువోకా గ్రాండ్ ప్రైజ్’ 2021 సంవత్సరానికి గానూ భారత్కు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ పీ సాయినాథ్ను వరించింది. గ్రామీణ భారత సంస్కృతిని తన రచనలతో వెలుగులోకి తీసుకొచ్చిన సాయినాథ్ ఈ పురస్కారానికి అర్హులని జపాన్కు చెందిన ఫుకువోకా పురస్కార కమిటీ ఒక ప్రకటనలో వెల్లడించింది.