కొలంబో, మార్చి 29: శ్రీలంకలో మందుల కొరతతో అత్యవసర శస్త్రచికిత్సలు సైతం నిలిపేయాల్సిన పరిస్థితి నెలకొన్నది. మందుల్లేక సర్జరీలు తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు కాండీలోని పెరడేనియా దవాఖాన డైరెక్టర్ తెలిపారు. దీనిపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు. దవాఖానకు అవసరమైన సాయం అందించాల్సిందిగా శ్రీలంకలోని భారత హైకమిషనర్ గోపాల్ భాగ్లేకు సూచించారు.