వాషింగ్టన్: మంచినీరు తాగడానికి ఎక్కువగా వినియోగించే రీయూజబుల్ వాటర్ బాటిళ్లపై మన ఆరోగ్యానికి హాని కలిగించేంత బ్యాక్టీరియా ఉంటుందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. టాయిలెట్ సీటు కంటే వాటర్ బాటిల్ మీద 40 వేల రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా ఉన్నట్టు గుర్తించారు.
అమెరికాకు చెందిన వాటర్ఫిల్టర్గురు.కామ్ అనే సంస్థ మనం ఎక్కువగా వినియోగించే మూడు రకాల వాటర్ బాటిళ్లను పరీక్షించింది. ఈ బాటిళ్ల మీద హానికర రీతిలో బ్యాక్టీరియా తిష్ఠ వేసిందని గుర్తించింది.