Gaza | ఐక్యరాజ్యసమితి: ముస్లింల పవిత్ర మాసం రంజాన్ సందర్భంగా గాజాలో కాల్పులను విరమించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి తొలిసారి డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం తీర్మానాన్ని ఆమోదించింది. అయితే ఓటింగ్కు అమెరికా గైర్హాజరైంది. దక్షిణ ఇజ్రాయెల్పై గత ఏడాది అక్టోబరు 7న హమాస్ జరిపిన దాడుల్లో బందీలుగా పట్టుకెళ్లిన వారిని విడిచిపెట్టాలని కూడా కోరింది.
అయితే బందీలను విడుదల చేస్తేనే కాల్పుల విరమణ జరుగుతుందనే షరతును విధించలేదు. ఐరాస తీర్మానం నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికా పర్యటనను రద్దు చేసుకున్నారు. ఆయన అమెరికా తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. హమాస్ వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెలీయుల విడుదలకు, కాల్పుల విరమణకు ముడి పెట్టకుండా తీర్మానం ఆమోదం పొందడానికి అవకాశం కల్పించిందని మండిపడ్డారు.