Damascus : కొత్త సంవత్సరం రోజున ఇజ్రాయేల్, సిరియాపై క్షిపణిలతో విరుచుకుపడింది. డమాస్కస్ అంతర్జాతీయ ఎయిర్పోర్టుపై ఆదివారం రాత్రి మిస్సైల్స్తో దాడి చేసింది. ఈ సంఘటనలో ఇద్దరు సిరియా భద్రతా దళానికి చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. క్షిపణి దాడి కారణంగా డమాస్కస్ ఎయిర్పోర్టులో సేవలు నిలిచిపోయాయి. ఈ ఎయిర్పోర్టులోని ఇరాన్కు సంబంధించిన వస్తువులను లక్ష్యంగా ఇరాన్ ఈ దాడికి తెగబడింది. సిరియా, లెబనాన్ దేశాలకు ఇరాన్ ఆయుధాలు సరఫరా చేస్తోంది. దాంతో, ఆగ్రహించిన ఇజ్రాయేల్ ఉదయం 2 గంటలకు డమాస్కస్ ఎయిర్పోర్టుపై క్షిపణులతో దాడి చేసింది.
ఇజ్రాయేల్లోని టిబెరియస్ చెరువు వైపు నుంచి మిసైల్స్ను ప్రయోగించారని సిరియా సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది. అయితే, ఈ దాడికి సంబంధించి ఇజ్రాయేల్ సైన్యం ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే.. విమానాశ్రయ సిబ్బంది క్షిపణి వ్యర్థాలను తొలగించారని, ఉదయం 9 గంటల నుంచి విమాన సర్వీసులు యథావిధిగా మొదలవుతాయని సిరియా రవాణా శాఖ వెల్లడించింది. గత ఏడాది కూడా సిరియాలోని విమానాశ్రయాలపై ఇజ్రాయేల్ దాడులకు పాల్పడింది. దాంతో, జూన్లో సిరియా రెండు వారాల పాటు విమాన సర్వీసులను నిలిపివేసింది.