టెల్ అవివ్/గాజా స్ట్రిప్, అక్టోబర్ 31: హమాస్తో యుద్ధాన్ని ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహూ స్పష్టం చేశారు. ఇరు పక్షాలు కాల్పులు విరమించాలని, యుద్ధాన్ని ఆపాలని ప్రపంచ దేశాలు, పలు అంతర్జాతీయ సంస్థలు కోరుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు.
మీడియా సమావేశంలో మాట్లాడుతూ గాజాలో కొనసాగుతున్న దాడులను ఆపేది లేదన్నారు. అలా చేస్తే హమాస్కు లొంగిపోయినట్టే అవుతుందని అన్నారు. కాల్పుల విరమణకు పిలుపునివ్వడం అంటే ఉగ్రవాదానికి, అనాగరికతకు లొంగిపోవడమేనని, ఇది జరుగదని స్పష్టం చేశారు.
ఉత్తరగాజాలోని శరణార్థి శిబిరంపై మంగళవారం ఇజ్రాయెల్ సైన్యం జరిపిన వైమానిక దాడిలో 50 మందికిపైగా పాలస్తీనియన్లు ప్రాణాలు కోల్పోయారు. సుమారు 150 మంది గాయపడ్డారు. గాజాలో ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి నెలకొన్నదని డబ్ల్యూహెచ్వో ఆందోళన వ్యక్తం చేసింది.