జెరూసలెం : జంతువుల్లా వ్యవహరిస్తున్న ఉగ్ర సంస్ధ హమాస్ను (Hamas Attack) యుద్ధంలో అంతమొందిస్తామని, ఉగ్ర మూకను మృగాలను వెంటాడినట్టు తరిమికొడతామని ఇజ్రాయెల్ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి మంత్రి అవి డిచర్ స్పష్టం చేశారు. హమాస్ వంటి ఉగ్ర సంస్ధపై పోరుకు ఎలాంటి సమర్ధన అవసరం లేదని, జంతువు మరో జంతువును వేటాటే రీతిలో నాగరిక జంతువులా హమాస్ ఉగ్రవాదుల వ్యవహార శైలి ఉందని దుయ్యబట్టారు.
మేం అలాంటి జంతువులను, మానవ జంతువులను యుద్ధ సమయంలో యుద్ధానంతరం కూడా టార్గెట్ చేస్తామని, ఏ ఒక్కరూ తప్పించుకోలేరని హెచ్చరించారు. గాజాలో అల్ అహ్లి బాప్టిస్ట్ ఆస్పత్రిపై పేలుడుకు హమాస్ దాని సభ్యులే బాధ్యులని ఆయన పేర్కొన్నారు.
గాజా ఆస్పత్రిలో ఏం జరిగిందో అందరం చూశామని, ఇది పాలస్తీనీయుల పనేనని, హమాస్ రాకెట్తో విరుచుకుపడిందా లేక బాంబ్ దాడికి పాల్పడిందా అనేది తేలాల్సి ఉందని అన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఇజ్రాయెల్ పర్యటనకు వచ్చే రోజే ఈ భీకర దాడి జరగడం యాధృచ్చికం కాదని పేర్కొన్నారు.
Read More :