గాజా స్ట్రిప్: దక్షిణ గాజాలోని రఫా పై సైనిక దాడులను వెంటనే నిలిపివేయాలన్న అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) ఆదేశాలను ఇజ్రాయెల్ బేఖాతరు చేసింది. రఫాపై దాడులను శుక్రవారం మరింత పెంచిందని స్థానికులు తెలిపారు.
నగరంలోని పలు లక్ష్యాలను బాంబులతో నాశనం చేయాలని ఇజ్రాయెల్ సైన్యం ప్రణాళికలు చేపట్టింది. రఫా నగరంపై సైనిక దాడులను వెంటనే నిలిపివేయాలని ఐసీజే శుక్రవారం ఇజ్రాయెల్ను ఆదేశించింది. దాడులను ఆపకుంటే అక్కడ భౌతిక వినాశనానికి దారితీసే అవకాశం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేసింది.