దుబాయ్, జనవరి 11: ఇరాన్-అమెరికా సంక్షోభానికి కేంద్రంగా ఉన్న ఒక చమురు ట్యాంకర్ను ఇరాన్ నావికా దళం స్వాధీనం చేసుకుంది. కొన్ని నెలల క్రితం టెహ్రాన్ అణు కార్యక్రమం నేపథ్యంలో విధించిన ఆంక్షల పేరుతో ఇరాన్కు చెందిన ఆయిల్ ట్యాంకర్ను అమెరికా స్వాధీనం చేసుకుంది. ఇప్పుడు ఇరాన్ చర్యతో మధ్యప్రాచ్య సముద్ర మార్గంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగాయి. అంతకుముందు
ఈ నౌకను సూయజ్ రజన్గా పిలిచే వారు. 2021లో ప్రారంభమై ఏడాది పాటు కొనసాగిన ఈ వివాదంలో అప్పట్లో అందులో ఉన్న మిలియన్ బ్యారెళ్ల ఇరాన్ క్రూడ్ను అమెరికాకు చెందిన జస్టిస్ శాఖ స్వాధీనం చేసుకుంది. ఇరాన్ ప్రోత్సాహంతో యెమెన్ నుంచి హౌతీలు ఎర్రసముద్రంలోని నౌకలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులకు దిగుతున్న విషయం తెలిసిందే. కాగా, ఇరాన్ నేతృత్వంలో నడిచే టెలివిజన్ కూడా గురువారం నాడు నౌక స్వాధీనం చేసుకున్న విషయాన్ని నిర్ధారించింది.