ఉక్రెయిన్పై రష్యా దాడికి దిగిన నేపథ్యంలో ఇరాన్ స్పందించింది. ఈ సందర్భంగా అమెరికా తీరుపై తీవ్రంగా మండిపడింది. ఇదంతా జరగడానికి నాటో రెచ్చగొట్టడంతోనే జరుగుతోందని ఇరాన్ విదేశాంగ మంత్రి ఆమీర్ అబ్దుల్లాహియన్ ఆరోపించారు. ఈ మూలాల నాసా రెచ్చగొట్టే విధానంలోనే దాగున్నాయన్నారు. అయితే యుద్ధంతోనే సమస్య పరిష్కారం అవుతుందని తాము ఏ మాత్రం భావించడం లేదని స్పష్టం చేశారు. ఉక్రెయిన్ సమస్యకు రాజకీయ కోణంలో, ప్రజాస్వామ్య కోణంలోనే సమస్యను పరిష్కరించుకోవాలని, ఆ మూలాల్లోనే సమస్యకు పరిష్కార మార్గాలున్నాయని ఆయన నొక్కి చెప్పారు.
రష్యా దాడులతో ఉక్రెయిన్ పౌరులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఉక్రెయిన్కు చెందిన 40 మంది సైనికులు, 10 మంది పౌరులు మృతి చెందారని ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రకటించింది. ఇక.. రష్యా చేసిన ఈ దాడిలో వందలాది మందిపౌరులు గాయాల పాలయ్యారని, ఈ సంఘటన అత్యంత దురదృష్టకరమని ఉక్రెయిన్ ప్రభుత్వం విచారం వ్యక్తం చేసింది.