టెహ్రాన్, ఏప్రిల్ 4: ఇస్లామాబాద్లో అమెరికా అధికారులను కలుసుకోవడం తనకు ఇష్టం లేదని మధ్యవర్తులకు ఇరాన్ స్పష్టం చేయడమే కాక, అమెరికా డిమాండ్లు ఎంతమాత్రం అంగీకరించదగినవి కావని స్పష్టం చేసింది. రాజీ చర్చలు జరిపేందుకు ఇరాన్ నిర్దంద్వంగా తిరస్కరిస్తుండటంతో అమెరికా-ఇరాన్ దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి జరుగుతున్న మధ్యవర్తిత్వ ప్రయత్నాలు ముగిసినట్టేనని వాల్స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.
‘పాకిస్థాన్ సహా పలు ప్రాంతీయ దేశాలు రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు చేస్తున్న ప్రయత్నాలకు తెర పడినట్టే’ అని ఆ పత్రిక పేర్కొంది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతల తొలగించడానికి జరుగుతున్న చొరవకు ఇది ఎదురు దెబ్బేనని వ్యాఖ్యానించింది.