లండన్, ఆగస్టు 30: ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్తో బాధపడుతున్న వారికి ఇంగ్లండ్ పరిశోధకులు శుభవార్త చెప్పారు. క్యాన్సర్ చికిత్సలో నూతన పద్ధతిని కనుగొన్నట్టు పరిశోధకులు వెల్లడించారు. నేషనల్ హెల్త్ సర్వీస్ ఆఫ్ బ్రిటన్ (ఎన్హెచ్ఎస్) ఆధ్వర్యంలో పరిశోధకులు ఈ చికిత్స విధానాన్ని అభివృద్ధి చేశారు. దీనికి మెడిసిన్స్ అండ్ హెల్త్కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ (ఎంహెచ్ఆర్ఏ) తాజాగా ఆమోదం తెలిపింది. దీని ద్వారా క్యాన్సర్ చికిత్సకు ఏడు నిమిషాల్లోనే ఇంజెక్షన్ వేయవచ్చు. దీని వల్ల చాలా సమయం ఆదా అవుతుంది. బ్రిటన్లోని వేల మంది ఊపిరితిత్తులు, రొమ్ము, కాలేయం, మూత్రాశయ క్యాన్సర్ బాధితులకు కు రక్త మార్పిడి పద్ధతిలో ఎన్హెచ్ఎస్ చికిత్స అందిస్తున్నది. ఈ పద్ధతిలో భాగంగా అటెజోలిజుమాబ్ ఇంజెక్షన్ను అందిస్తున్నారు. దీన్ని చర్మం ద్వారా నేరుగా సిరలకు వేస్తారు. అయితే దీనికి ప్రస్తుతం సుమారుగా 30-60 నిమిషాల సమయం పడుతుంది.