Indian Student | గత నెలలో బ్రిటన్లో అదృశ్యమైన భారతీయ విద్యార్థి (Indian Student) కథ విషాదాంతమైంది. 23 ఏళ్ల మిత్ కుమార్ పటేల్ (Mitkumar Patel) లండన్ నది (London River)లో శవమై తేలాడు. మృతదేహాన్ని అధికారులు నది నుంచి స్వాధీనం చేసుకున్నారు.
ఉన్నత చదువుల కోసం మిత్కుమార్ సెప్టెంబర్లో యూకే వెళ్లాడు. నవంబర్ 20వ తేదీ నుంచి షెఫీల్డ్ హాలమ్ వర్సిటీలో డిగ్రీ కోర్సు ప్రారంభించాల్సి ఉంది. అమెజాన్లో పార్ట్టైమ్ జాబ్ కూడా సంపాదించాడు. అయితే, నవంబర్ 17న డైలీ వాక్కు అని వెళ్లిన మిత్ కుమార్ తిరిగి ఇంటికి రాలేదు. బంధువుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విద్యార్థి కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో నవంబర్ 21వ తేదీన తూర్పు లండన్లోని కానరీ వార్ఫ్ ప్రాంతానికి (Canary Wharf area) సమీపంలోని థేమ్స్ నది (Thames River)లో అతడి మృతదేహాన్ని మెట్రోపాలిటన్ పోలీసులు (Metropolitan Police) గుర్తించారు. అతడి మరణానికి గల కారణాలపై విచారణ చేస్తున్నారు.
Also Read..
Ladakh | లడఖ్లో స్వల్పంగా కంపించిన భూమి.. భయాందోళనలో ప్రజలు
Ganja | జహీరాబాద్ సమీపంలో బోల్తాపడిన కారు.. భారీగా గంజాయి లభ్యం
Telangana | నెల రోజుల సందడికి బ్రేక్.. పోలింగ్ అయిపోవడంతో మూగబోయిన పల్లెలు