Ranil Wickremesinghe | అమెరికా డాలర్తో సమానంగా భారత్ రూపాయిని ఉపయోగించాలని తమ దేశం కోరుకుంటోందని శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే అన్నారు. శ్రీలంక ఇండియన్ సీఈవో ఫోరమ్లో పాల్గొన్న ఆయన.. ఈ వ్యాఖ్యలు చేశారు. జపాన్, కొరియా, చైనావంటి దేశాలతో సహా తూర్పు ఆసియాలో 75 సంవత్సరాల క్రితం అద్భుతమైన అభివృద్ధి జరిగినట్లయితే.. ఇప్పుడు హిందు మహాసముద్ర ప్రాంతంలో భారతదేశం వంతు వచ్చిందన్నారు. ఫోరమ్ అధ్యక్షుడు టీఎస్ ప్రకాశ్ సమావేశంలో శ్రీలంక ఆర్థిక వ్యవస్థలో భారత రూపాయి వినియోగాన్ని పెంచాలని కోరారు.
ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. పిలుపునిచ్చినందుకు ప్రతిస్పందనగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. ప్రపంచం అభివృద్ధి చెందుతోందని, భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. త్వరలో భారత్లో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వచ్చే వారంలో ఆయన ఢిల్లీలో పర్యటించనున్నారు. ఇటీవల శ్రీలంక ఆర్థిక, రాజకీయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న విషయం తెలిసిందే. ఏడాది కిందట అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన విక్రమ సింఘే తొలిసారిగా భారత్లో పర్యటించనున్నారు.