Aroh Barjatya | వాషింగ్టన్, అక్టోబర్ 5: సూర్య గ్రహణ అధ్యయనం కోసం నాసా ప్రయోగిస్తున్న మూడు సౌండింగ్ రాకెట్ల మిషన్కు భారత సంతతి శాస్త్రవేత్త ఆరోహ్ భర్జత్య సారథ్యం వహించనున్నారు. ఆయన ప్రస్తుతం ఎంబ్రీ-రిడ్డిల్ ఏరోనాటికల్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ ఫిజిక్స్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు.
ఈ ప్రయోగం ఈ నెల 14న జరగనున్నది. సూర్యుడి వెలుతురు హఠాత్తుగా తగ్గడం మన ఉపరితల వాతావరణాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనే అంశాన్ని ఈ ప్రయోగంలో అధ్యయనం చేయనున్నారు. ఈ నెల 14న సూర్య గ్రహణాన్ని చూసేవారు సూర్యుడి సాధారణ ప్రకాశంలో 10 శాతం తగ్గుదలను గమనిస్తారు.