Blood test scam | రక్త పరీక్ష పేరుతో కోట్ల రూపాయాల కుంభకోణంలో భారత సంతతికి చెందిన వ్యాపారిని అమెరికా కోర్టు 13 ఏండ్ల జైలు శిక్ష విధించింది. మాజీ ప్రియురాలుతో కలిసి ఈ కుట్రకు పాల్పడినట్లు తెలుస్తున్నది. ఇన్వెస్టర్లకు అబద్దాలు చెప్పి మోసం చేసిన కేసులో నిందితుడి మాజీ ప్రియురాలుకు ఇప్పటికే కాలిఫోర్నియా కోర్టు 11 ఏండ్ల జైలు శిక్ష విధించింది.
భారత సంతతి వ్యాపారి రమేశ్ సన్నీ బల్వానీకి అమెరికా జిల్లా కోర్టు ఒకటి గురువారం 13 ఏండ్ల జైలు శిక్ష విధించింది. తన కంపెనీ పెట్టుబడిదారులకు తప్పుడు ప్రకటనలు చేసి చెప్పి లక్షలాది మంది నుంచి పెద్ద కోట్లాది రూపాయలు దోచుకున్నట్లు రమేశ్ బల్వానీపై ఆరోపణలు ఉన్నాయి. బల్వానీ మాజీ ప్రియురాలు ఎలిజబెత్ హూమ్స్ 2003 లో రక్త పరీఓ స్టార్టప్ థెరానోస్ను ప్రారంభించింది. ఈ కంపెనీలో రమేశ్ సన్నీ బల్వానీ వ్యాపార భాగస్వామిగా చేరి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) గా ఉన్నాడు. థెరానోస్ అనే సంస్థ రక్త పరీక్షల రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది.
ఇన్వెస్టర్లను తన మోసపూరిత ప్రకటనలతో మోసం చేసి వారి నుంచి కోట్లలో నగదు రమేశ్ బల్వానీ తన ఖాతాలో వేసుకున్నట్లు అమెరికా అధికారులు గుర్తించారు. 12 కేసుల్లో బల్వానీని నిందితుడిగా కోర్టు నిర్ధారించింది. ఇందులో 10 కేసులు మోసానికి సంబంధించినవి. కాగా, 2 కేసులు కుట్రకు సంబంధించినవి ఉన్నాయి. బల్వానీకి 15 ఏండ్ల శిక్ష విధించాలని, అతడి నుంచి రూ.6,000 కోట్లు పరిహారంగా వసూలు చేయాలని ప్రాసిక్యూటర్ డిమాండ్ చేశారు. ఈ కేసును కోర్టు ఇంకా విచారిస్తున్నది. తదుపరి విచారణను ప్రస్తుతానికి వాయిదా వేసింది.