న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్లోని కాందహార్లో ఉన్న తన రాయబార కార్యాలయ సిబ్బందిని భారత్ వెనక్కి తీసుకొచ్చింది. కాందహార్ చుట్టుపక్కల ప్రాంతాలను తాలిబన్లు తమ ఆధీనంలోకి తెచ్చుకుంటుండటం, భద్రతపరంగా అక్కడ పరిస్థితులు క్షీణిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అక్కడున్న 50 మంది మన దౌత్య, భద్రతా సిబ్బంది వాయుసేన ప్రత్యేక విమానంలో భారత్ చేరుకున్నారు. పాక్ గగనతలం మీదుగా కాకుండా వేరే మార్గంలో ఈ విమానం చేరుకుంది.