సిడ్నీ/న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాలో జరిగిన కారు ప్రమాదంలో భారతీయ వ్యక్తి మరణించాడు. (Indian killed in Australian car crash ) భర్త మృతదేహాన్ని భారత్కు తరలించేందుకు సహాయం చేయాలని అతడి భార్య కోరింది. భారత్కు చెందిన 26 ఏళ్ల ఖుష్దీప్ సింగ్, మెల్బోర్న్లో లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సోమవారం రాత్రి 11.15 గంటల సమయంలో పామర్స్ రోడ్లో కారు డ్రైవింగ్ చేస్తుండగా ప్రమాదం జరిగింది. కారు పలుమార్లు బోల్తా కొట్టింది. తీవ్రంగా గాయపడిన అతడికి వైద్య సేవలు అందించేందుకు అత్యవసర మెడికల్ సిబ్బంది ప్రయత్నించారు. అయితే అతడు సంఘటనా స్థలంలో చనిపోయాడు. ఈ ప్రమాదానికి కారణం తెలియదని, అలసట వల్ల జరిగి ఉండవచ్చని ఆస్ట్రేలియా పోలీస్ అధికారులు తెలిపారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
కాగా, తన భర్త మృతదేహాన్ని భారత్లో ఉన్న అతడి తల్లిదండ్రుల వద్దకు చేర్చేందుకు సహకరించాలని మృతుడి భార్య జప్నీత్ కౌర్, కేంద్ర ప్రభుత్వానికి విజ్తప్తి చేసింది. అలాగే ఖర్చుల కోసం నిధుల సేకరణ ప్రారంభించింది. ఆమె చదువు నిమిత్తం గత ఏడాది ఆస్ట్రేలియా వచ్చి భర్తతో కలిసి ఉంటున్నది.