న్యూఢిల్లీ : ప్యాసింజర్, గూడ్స్ వాహనాలకు సంబంధించి పోట్రోకాల్పై భారత్, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్ చర్చించాయి. వ్యాపారాన్ని సులభతరం చేయడంతో పాటు ప్రజల రాకపోకలను ప్రోత్సహించేందుకు మోటారు వాహన ఒప్పందం (MVA) చర్చించాయి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటన ప్రకారం.. నాలుగు దేశాలు సోమ, మంగళవారాల్లో భూటాన్, బంగ్లాదేశ్, భారతదేశం, నేపాల్ మోటార్ వెహికల్ అగ్రిమెంట్ (BBIN MVA)పై సమావేశం చర్చలు జరిపాయని.. భూటాన్ పరిశీలకుడిగా పాల్గొందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
ఈ ఒప్పందంపై 15 జూన్, 2015న సంతకం చేశారు. ఒప్పందాన్ని అమలు చేయడానికి కట్టుబాట్లను వివరిస్తూ.. మరోసారి సంతకాలు చేయబోయే సమావేశం అవగాహన ఒప్పందం (MOU) ఖరారు చేసినట్లు మంత్రిత్వశాఖ పేర్కొంది. వ్యాపారాన్ని సులభతరం చేయడానికి, ప్రజల మధ్య సంబంధాలను ప్రోత్సహించేందుకు యాక్ట్ అమలును వేగవంతం చేసేందుకు అన్ని దేశాలు నిర్ణయించాయి. సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి విదేశాంగ సంయుక్త కార్యదర్శి స్మితా పంత్ నాయకత్వం వహించారు.