వాషింగ్టన్, అక్టోబర్ 29: ఆరోగ్యానికి సరిపడా నిద్ర చాలా అవసరం. ముఖ్యంగా యువతకు కంటినిండా నిద్ర ఉండాలి. రోజులో 8 గంటలకన్నా తక్కువ నిద్రపోయే యుక్తవయస్కులకు ఊబకాయ ముప్పు పొంచి ఉందని తాజా అధ్యయనంలో తేలింది. కంటినిండా నిద్రపోయే యువతతో పోల్చినప్పుడు నిద్రలేమితో బాధపడేవారు లావైపోతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. 12,14,16 ఏండ్ల వయసున్న 1,299 మందిపై అధ్యయనం నిర్వహించిన స్పెయిన్ పరిశోధకులు ఈ విషయాన్ని తేల్చారు. తక్కువగా నిద్రపోతున్నవారిలో అధిక కొవ్వు, అధిక రక్తపోటు, రక్తంలో లిపిడ్, గ్లూకోజ్ స్థాయిల్లో పెరుగుదలతోపాటు ఇతర రోగాలు గుర్తించామని తెలిపారు.