Earth | న్యూయార్క్, జూలై 21: ఈ ఏడాది జూలైలో ప్రపంచవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయని, వడదెబ్బలు కూడా భారీగానే నమోదైన ఈ నెల భూమిపై అత్యంత వేడి మాసంగా రికార్డులకెక్కనున్నదని అంతరిక్ష పరిశోధనా సంస్థ (నాసా) వెల్లడించింది. యురోపియన్ యూనియన్, మైన్ వర్సిటీ వాతావరణ ట్రాకింగ్ సాధనాల ద్వారా ఉపగ్రహం ఆధారంగా సేకరించిన డాటాను విశ్లేషించి ఈ విషయాన్ని తేల్చినట్టు వాతావరణ శాస్త్రవేత్త గావిన్ స్మిత్ వెల్లడించారు. యూరోప్, చైనా, అమెరికాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపారు. దీనికి గ్రీన్హౌస్ వాయువులే కారణమని తేల్చారు. ప్రపంచంలోని అన్ని దేశాలు అప్రమత్తంకాకుంటే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు చోటుచేసుకొంటాయని హెచ్చరించారు.