న్యూఢిల్లీ : బ్రిక్స్ సదస్సు నేపధ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మధ్య సరిహద్దు వివాదం (India China relations) సహా ద్వైపాక్షిక అంశాలపై సంప్రదింపులు జరిగాయని బీజింగ్ అధికారిక ప్రకటనలో వెల్లడించింది. భారత్-చైనా సంబంధాల మెరుగుపడితే ఇరు దేశాలతో పాటు ప్రజల ఉమ్మడి ప్రయోజనాలు నెరవేరతాయని జిన్పింగ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
ప్రపంచంతో పాటు ఈ ప్రాంత అభివృద్ధి, శాంతి, సుస్ధిరతకు ఇండో-చైనా సంబంధాల బలోపేతం మార్గం సుగమం చేస్తుందని అన్నారు. సరిహద్దు ప్రాంతంలో శాంతిని కాపాడేందుకు ఇరు దేశాలు తమ ద్వైపాక్షిక సంబంధాలను దృష్టిలో ఉంచుకుని సరిహద్దు సమస్యను సరైన రీతిలో పరిష్కరించుకోవాలని ప్రధాని మోదీతో జిన్పింగ్ స్పష్టం చేసినట్టు చైనా తెలిపింది.
దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ గురువారం పక్కపక్కన నడుస్తూ కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. భారత్-చైనా సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో అపరిష్కృత అంశాలపై ఈ సందర్భంగా జిన్పింగ్తో ఆందోళన వ్యక్తం చేశారని విదేశాంగ కార్యదర్శి వినయ్ మోహన్ పేర్కొన్నారు. మోదీ, జిన్పింగ్ల మధ్య రెండు వారాల్లోనే ఇది రెండవ భేటీ కావడం గమనార్హం. అంతకుముందు ఢిల్లీలో జరిగిన జీ20 సదస్సు నేపధ్యంలో ఇరు దేశాధినేతల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి.
Read More :
CM Hemanth Soren | ఈడీ సమన్లపై సుప్రీంకోర్టులో సవాల్ చేసిన జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్