కొలంబో : ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకకు అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) ఇటీవల 2.9 బిలియన్ డాలర్ల సహాయం అందించేందుకు అంగీకరించింది. ఈ మేరకు శ్రీలంక సర్కారు, ఐఎంఎప్ అధికారుల మధ్య ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందంపై ఐఎంఎఫ్ చీఫ్ క్రిస్టాలినా జార్జివా హర్షం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం కీలకమైన ముందడుగుగా అభివర్ణించారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న ద్వీప దేశానికి నాలుగు సంవత్సరాల వ్యవధిలో 2.9 బిలియన్ల డాలర్ల రుణం అందించనున్నట్లు ఐఎంప్ గురువారం ప్రకటించింది. ఈ బెయిలవుట్ ప్యాకేజీ శ్రీలంక క్రెడిట్ రేటింగ్, అంతర్జాతీయ రుణదాతలు, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచుతుందని భావిస్తున్నారు. కొత్త ఎక్స్టెండెడ్ ఫండ్ ఫెసిలిటీ (EFF)తో శ్రీలంక స్థూల ఆర్థిక స్థిరత్వం, రుణ స్థిరత్వ పునరుద్ధరణకు మద్దతు ఇస్తుందని, అదే సమయంలో ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుతుందని ఐఎంఎఫ్ పేర్కొంది.