అమెరికాకు చెందిన ఓ రోగి వైద్యుడి వద్దకు వెళ్లింది. వైద్యుడు ఆమెకు అన్ని పరీక్షలు చేశాడు. ఆమెకు ఎదురవుతున్న ఇబ్బందులను ఆమె వైద్యుడి ముందు పూర్తిగా చెప్పుకుంది. వైద్యుడు కూడా శ్రద్ధగానే విన్నాడట. ఇక్కడే మలుపు తిరిగింది. ఆమె తన బాధలు చెప్పుకుంటూ.. వైద్యుడి ముందు భోరున విలిపించింది. అంతే.. ఈ భోరున విలపించిందని ఆ ఆస్పత్రి యాజమాన్యం ఆ రోగికి ఏకంగా ఫైన్ విధించింది.
ఇలా ఆ ఆస్పత్రి యాజమాన్యం ఫైన్ విధించిందన్న సంగతి ఆమెకు బిల్లు కట్టే వరకూ అసలు తెలియదు. ఆస్పత్రి యాజమాన్యం ఇచ్చిన బిల్లును చూసుకుంటున్న సమయంలో బిహేవియర్ అస్సెస్మెంట్ పేరు మీద ఆమెకు 3,100 రూపాయల ఫైన్ వుంది. ఎందుకని ఆరా తీస్తే.. ట్రీట్మెంట్ సమయంలో వైద్యుడి ముందు ఆ రోగి భోరున ఏడ్చిందని, అందుకే ఫైన్ వేశామని ఆస్పత్రి యాజమాన్యం తెగేసి చెప్పింది. దీంతో కుటుంబీకులు బిత్తర పోయారు.
ఈ విషయాన్ని రోగి సోదరి కెమిల్లె జాన్సన్ సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది. నా చెల్లెలికి ఆరోగ్యం బాగోలేదు. వైద్యుడి దగ్గరికి వెళ్లాం. వైద్యం సమయంలో భోరున ఏడ్చేసిందని 3,100 ఫైన్ వేశారు అంటూ కెమిల్లె జాన్సన్ పేర్కొన్నారు.
My little sister has been really struggling with a health condition lately and finally got to see a doctor. They charged her $40 for crying. pic.twitter.com/fbvOWDzBQM
— Camille Johnson (@OffbeatLook) May 17, 2022