జెరూసలెం : ఇజ్రాయెల్, పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ మధ్య భీకర దాడులు కొనసాగుతున్నాయి. భూతల దాడులను ఉధృతం చేయడంపై ఇజ్రాయెల్ రక్షణ దళం (IDF) ఆదివారం విస్పష్ట సంకేతాలు పంపింది. అత్యంత శక్తివంతమైన బలగాలతో హమాస్కు దీటుగా బదులిచ్చేందుకు సన్నద్ధంగా ఉన్నామని పేర్కొంది.
ఉగ్ర సంస్ధ హమాస్పై తమ యుద్ధం గాజా ప్రజలకు వ్యతిరేకం కాదని ఐడీఎఫ్ స్పష్టం చేసింది. ప్రపంచంలో ఉగ్రవాదానికి చోటు లేదని ఐడీఎఫ్ ట్విట్టర్ వేదికగా పేర్కొంది. ఇజ్రాయెల్పై హమాస్ చేపట్టిన దాడులకు సంబంధించి పలు ఘటనలతో కూడిన వీడియోను ఐడీఎఫ్ షేర్ చేసింది. మాకు హమాస్ ఎలాంటి అవకాశాలనూ ఇవ్వలేదు. ఇజ్రాయెల్ను కాపాడుకునేందుకు తాము హమాస్ను ధ్వంసం చేయడం ఒక్కటే మార్గమని పేర్కొంది.
ఉత్తర గాజా స్ట్రిప్లోని ప్రజలంతా ఎవాక్యుయేషన్ కారిడార్ల ద్వారా దక్షిణ ప్రాంతానికి చేరుకోవాలని పిలుపు ఇచ్చింది. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంలో భద్రత దృష్ట్యా వీరంతా సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని ఐడీఎఫ్ అంతర్జాతీయ ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ రిచర్డ్ హెక్ట్ వీడియో సందేశంలో పిలుపు ఇచ్చారు. ఇజ్రాయెల్ ప్రజలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఐడీఎఫ్పై ఉందని, తమ యుద్ధం గాజా ప్రజలకు వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. అందుకే గాజాను నిర్మూలించేందుకు తాము ముందుకు కదులుతున్నామని చెప్పారు.
Read More :
Cheetah | నారాయణపేట జిల్లాలో ఎట్టకేలకు చిక్కిన చిరుత.. ఆపరేషన్ సక్సెస్