బుదాపెస్ట్: ఉచితంగా లక్ష మంది ఉక్రెయిన్ శరణార్థులను తరలిస్తామని హంగేరికి చెందిన విజ్ ఎయిర్ సంస్థ ప్రకటించింది. ట్విట్టర్ అకౌంట్లో ఈ విషయాన్ని ఆ విమానయాన సంస్థ పోస్టు చేసింది. స్వల్ప దూరాలకు ఉచిత విమాన సర్వీసులు నడపున్నట్లు చెప్పింది. స్వంత దేశాలకు వెళ్లే ఉక్రెయిన్ శరణార్థులకు హెల్ప్ చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు విజ్ ఎయిర్ వెల్లడించింది. మార్చి నెలలో పోలాండ్, స్లోవేకియా, హంగేరి, రొమేనియా దేశాల నుంచి బయలుదేరే విమానాలకు ఈ ఆఫర్ వర్తించనున్నట్లు విజ్ ఎయిర్ చెప్పింది. రష్యా దాడి ప్రకటించిన తర్వాత ఇప్పటి వరకు ఉక్రెయిన్ను వీడి సుమారు ఆరున్నర లక్షల మంది వలస వెళ్లినట్లు యూఎన్ రెఫ్యూజీ ఏజెన్సీ తెలిపింది. అయితే ఎక్కువ శాతం మంది పోలాండ్ను ఆశ్రయిస్తున్నారు. ఆ దేశానికి ఇప్పటికే నాలుగున్నర లక్షల మంది చేరుకున్నట్లు తెలుస్తోంది.