సనా, సెప్టెంబర్ 10: ఇరాన్ మద్దతుతో హౌతీ తిరుగుబాటు దళాలు ‘యెమెన్’పై క్రమంగా పట్టు సాధిస్తున్నాయి. యెమెన్ ప్రభుత్వానికి బలమైన స్థావరంగా ఉన్న ‘అల్ మొఖా’ నగరాన్ని హౌతీలు స్వాధీనం చేసుకున్నారు. ప్రపంచ వాణిజ్యానికి కీలకంగా ఉన్న ‘బాబ్ అల్ మండేబ్’ జలసంధి వైపు హౌతీ తిరుగుబాటు దళాలు కదులుతున్నాయి.
దీంతో ఎర్రసముద్ర తీరప్రాంతం, దేశంలోనే కీలకమైన జలసంధి హౌతీల ఆధీనంలోకి వెళ్లనున్నాయి. గురువారం హౌతీ తిరుగుబాటు దళాలు అల్ మొఖా నగరంలోకి ప్రవేశించటంతో..స్థానికులు ఇజ్రాయెల్, అమెరికాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.