PM Modi : భారత్కు నాలుగు అతిపెద్ద ఆకాంక్షలున్నాయని ప్రధాని మోదీ వెల్లడించారు. ఇండియాలో ఒలింపిక్స్ నిర్వహించడం అందులో ఒకటని మోదీ తెలిపారు. శనివారం నెదర్లాండ్స్లోని హాగ్వేలో భారతీయులతో నిర్వహించిన కార్యక్రమంలో మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా దేశ ఆకాంక్షలు, లక్ష్యాలు, రాజకీయ పరిస్థితులపై స్పందించారు. ఇండియాకు నాలుగు ఆకాంక్షలున్నాయన్నారు.
ఒలింపిక్స్ నిర్వహించడం, అంతర్జాతీయ తయారీ కేంద్రంగా మారడం, గ్రీన్ ఎనర్జీ హబ్గా ఎదగడంతోపాటు ప్రపంచ ఆర్థిక శక్తిగా నిలవడం అనే నాలుగు లక్ష్యాలున్నట్లు వెల్లడించారు. ‘‘భారతీయ ఆకాంక్షలు అనంతం. అలాగే, మన ప్రయత్నం కూడా అపరిమితం. కీలక తయారీ కేంద్రంగా ఇండియా ఎదుగుతోంది. దేశాన్ని ఆధునిక టెక్ స్టార్టప్ వ్యవస్థగా మార్చేందుకు దేశ యువత నిరంతరం పని చేస్తోంది. దేశంలో డ్రోన్లు, ఏఐ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్న దేశ యువతకు ధన్యవాదాలు. ప్రపంచంలోనే ఇండియా మూడో అతిపెద్ద స్టార్టప్ వ్యవస్థగా నిలిచింది. సెమీకండక్టర్ల తయారీ హబ్గా ఇండియా మారనుంది. ఇటీవలే అతిపెద్ద ఏఐ సదస్సును ఇండియాలో నిర్వహించాం.
ఏఐలో అభివృద్ధి దిశగా ఇండియా ముందడుగు వేస్తోంది. దేశంలో 12 సెమీ కండక్టర్ తయారీ యూనిట్లు సిద్ధమవుతున్నాయి. వాటిలో రెండింట్లో పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. 2014, మే 16న మా రాజకీయ ప్రయాణం మొదలైంది. ఆ రోజు దేశంలో బీజేపీకి మెజారిటీ దక్కింది. బీజేపీకి, దేశ ప్రజలకు మధ్య బంధం మరింత బలోపేతం అవుతోంది. జల్మురి ఇక్కడికి కూడా చేరిందా..? ఇటీవలి ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యం పెరిగింది. దాదాపు 80–90 శాతం ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
ప్రతి ఏటా ఓటింగ్ శాతం పెరుగుతోంది. ఇది మన దేశంలో పెరుగుతున్న ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిదర్శనం. అందుకే ఇండియాను ‘మదర్ ఆఫ్ డెమోక్రసీ’ అంటారు. భారత్ అభివృద్ధి చెందితే అది ప్రపంచానికి మేలు చేస్తుంది” అని మోదీ ప్రసంగించారు.