బొగట: డ్రగ్ లార్డ్ పాబ్లో ఎస్కోబార్(Pablo Escobar) అందరికీ తెలిసిందే. కొలంబియాకు చెందిన ఆ మాఫియా కింగ్ ఇప్పుడు లేరు. కానీ అతను ఓ దశలో ప్రపంచాన్ని వణికించాడు. మాదకద్రవ్యాల బిజినెస్తో అమెరికాను కూడా గజగజలాడించాడు. అయితే అతను ఇష్టపడి తెచ్చుకున్న హిప్పో(Hippos)లు ఇప్పుడు ఆ దేశానికి భారంగా మారాయి. ఎస్కోబార్ను చంపిన తర్వాత ఆ హిప్పో జంతువుల్ని పట్టించుకునేవారు లేకుండాపోయారు.
1980 దశకంలో ఎస్కోబార్ ఆఫ్రికా(Africa) నుంచి కొన్ని హిప్పోలను తన దేశానికి తెచుకున్నాడు. కానీ 1993లో అతన్ని హతమార్చిన తర్వాత ఆ హిప్పోలు స్వేచ్ఛగా తిరగడం మొదలుపెట్టాయి. ఆంటియోకియాలో ఉన్న చిత్తడి నేలల్లో ఫ్రీగా మూవ్ అయ్యాయి. అయితే ఇప్పుడు వాటి సంఖ్య 150 దాటింది. ఇక వాటిని కొలంబియా(Columbia) పెంచుకోలేకపోతున్నది. ఈ నేపథ్యంలో స్థానిక ప్రభుత్వం ఓ ఐడియాకు వచ్చింది. దాదాపు 70 హిప్పోలను విదేశాలకు తరలించాలని చూస్తున్నది.
హిప్పోల్లో సుమారు 10 జంతువులను మెక్సికోలో ఉన్న ఓస్టాక్ వన్యప్రాణి(Ostok Sanctuary) కేంద్రానికి తరలించనున్నారు. అయితే మరో 60 హిప్పోలను మాత్రం ఇండియాకు పంపాలన్న ఆలోచనలో కొలంబియా ఉన్నట్లు ఓ రిపోర్టు ద్వారా తెలిసింది. ఇండియాలో ప్రస్తుతం హిప్పో జాతికి చెందిన రైనోలు ఉన్న విషయం తెలిసిందే. అస్సాంలో ఉన్న ఖాజీరంగా జాతీయ అటవీ క్షేత్రంలో రైనోలు ఉన్నాయి.
అయితే హిప్పోలను వదిలించుకోవాలనుకుంటున్న కొలంబియాకు.. ఆ జంతువుల్ని తరలించేందుకు సుమారు 3.5 మిలియన్ల డాలర్లు ఖర్చు చేయనున్నది. తరలింపు ఆపరేషన్కు ఆ మొత్తం ఖర్చు అవుతుందని ఓస్టాక్ సాంక్చరీ ఓనర్ తెలిపారు.