ఇస్లామాబాద్, మే 28: పాకిస్థాన్లోని గిల్గిట్-బాల్టిస్థాన్ ప్రాంతంలో శనివారం సాయంత్రం భారీ హిమపాతం విరుచుకుపడింది. ఈ ఘటనలో ముగ్గురు మహిళలు సహా 10 మంది మరణించారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడ్డ వారిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉన్నది. రెస్యూ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. కొందరు పశువులతో సహా కొండ ప్రాంతం నుంచి ప్రయాణిస్తుండగా అస్టోర్ జిల్లాలోని షంటర్ టాప్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.