కాఠ్మండు, జూన్ 18: నేపాల్లో భారీ వర్షాలకు వరదలు పోటెత్తుతున్నాయి. కొండచరియలు విరిగిపడుతున్నాయి. దీంతో ఇద్దరు మరణించారు. 28 మంది గల్లంతయ్యారు.
తప్పిపోయిన వారి ఆచూకీ కోసం అధికారులు గాలింపు చేపడుతున్నారు. వర్షాల ధాటికి రోడ్లు, భవనాలు దెబ్బతిన్నాయి. రోడ్లు కొట్టుకుపోవడంతో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతున్నదని అధికారులు చెప్పారు.