న్యూయార్క్ : బాలికలు రజస్వల అవడానికి, గాలి కాలుష్యానికి సంబంధం ఉందని అమెరికాలోని హార్వర్డ్, ఎమోరీ విశ్వవిద్యాలయాల పరిశోధకులు గుర్తించారు. నివాస ప్రాంతాల్లో అధిక ధూళి కణాలు గల కలుషిత గాలిని బాల్యంలో పీల్చే బాలికలకు రుతుక్రమం త్వరగా వస్తుందని గుర్తించారు. ఇటువంటి బాలికలు తమ జీవితంలో అనేక వ్యాధులకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని తెలిపారు. గుండె జబ్బులు, టైప్-2 మధుమేహం, కొన్ని రకాల క్యాన్సర్లు వారికి సోకే ప్రమాదం ఉందన్నారు.