గాజా: తమ వద్ద బందీలుగా ఉన్న వారిలో మొదటి విడతగా హమాస్ 25 మంది పౌరులను గాజాస్ట్రిప్ నుంచి శుక్రవారం విడుదల చేసింది. వీరిలో 13 మంది ఇజ్రాయెల్, 12 మంది థాయ్ పౌరులు ఉన్నారు.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా వీరిని విడిచిపెట్టినట్టు ఇజ్రాయెల్ మీడియా వెల్లడించింది. ఇజ్రాయెల్ కూడా శుక్రవారం తమ జైళ్లలో శిక్ష అనుభవిస్తున్న 39 మంది పాలస్తీనియన్లను విడిచిపెట్టింది. వీరిలో 24 మంది మహిళలు, 15 మంది టీనేజర్లు ఉన్నారు.