పోర్ట్ ఓ ప్రిన్స్, మార్చి 10: హైతీ రాజధాని పోర్ట్ ఓ ప్రిన్స్ క్రిమినల్ గ్యాంగుల చేతికి చిక్కింది. దీంతో చాలామంది ప్రజలు ఇండ్లను వదిలివెళ్లిపోతున్నారు. దాదాపు 3,62,000 మంది వలసబాట పట్టారు. ఈ మేరకు ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ ఒక ప్రకటన విడుదల చేసింది.
హైతీ ప్రజలు నిత్యం భయం గుప్పిట ఉండాల్సిన పరిస్థితి నెలకొన్నదని, చాలా మంది ఇండ్లలో ఉండి తాళాలు వేసుకుంటున్నారని తెలిపింది. వీధివీధిలో సాయుధ దుండగులే కనిపిస్తున్నారని వెల్లడించింది. పలు ప్రభుత్వ కార్యాలయాలు, పోలీస్స్టేషన్లను ఆక్రమించేందుకు క్రిమినల్ గ్యాంగులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. అనేక దవాఖానలు వీరి చేతుల్లోకి చేరాయి.