న్యూయార్క్: అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి మృతిపై భారత ప్రభుత్వం స్పందించింది. విద్యార్థి మృతి పట్ల ఎగతాళిగా మాట్లాడిన పోలీస్ అధికారిపై చర్యలు తీసుకోవాలని అమెరికా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
నార్త్ ఈస్ట్రన్ యూనివర్సిటీలో చదువుతున్న 23 ఏండ్ల కందుల జాహ్నవి ఈ ఏడాది జనవరిలో పోలీస్ గస్తీ వాహనం ఢీకొని మరణించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీస్ అధికారి జాతి దురహంకార వ్యాఖ్యలు చేశారు. ఆమె మరణానికి విలువ లేదన్నట్టుగా వ్యాఖ్యానించారు.