అనుమతులు లేకుండా వినియోగదారుల డేటాను ట్రాక్ చేసిందన్న ఆరోపణలతో గూగుల్ కంపెనీపై కేసు పడింది. అగ్రరాజ్యం అమెరికాలోని కొలంబియాలో ఈ ఘటన జరిగింది. వినియోగదారుల లొకేషన్ను అనుమతి లేకుండా ట్రాక్ చేస్తున్నట్లు గూగుల్పై ఆరోపణలు వచ్చాయి.
దీనికోసం గూగుల్ కంపెనీ వినియోగదారులను తప్పుదోవ పట్టించిందని ఈ కేసులో డీసీ అటార్నీ జనరల్ కార్ల్ రాసిన్ ఆరోపించారు. ‘‘వినియోగదారుల ఖాతాను, డివైజ్ సెట్టింగులను మార్చడం ద్వారా యూజర్ల ప్రైవసీకి రక్షణ జరుగుతుందని గూగుల్ భ్రమ కలిగించింది.
అలాగే ఇలా చేయడం ద్వారా యూజర్లకు సంబంధించిన ఏ డేటాను కంపెనీ ట్రాక్ చేయొచ్చనే కంట్రోల్ కూడా యూజర్లకే ఇచ్చినట్లు గూగుల్ చెప్పింది. ఈ విధంగా వారి లొకేషన్ను ట్రాక్ చేస్తోంది’’ అని కార్ల్ ఆరోపించారు.