వాషింగ్టన్: గూగుల్ అండ్ ఆల్ఫాబెట్ సీఈవో సుందర్ పిచాయ్ భారత ప్రతిష్ఠాత్మక అవార్డు పద్మ భూషణ్ స్వీకరించారు. అమెరికాలో భారత రాయబారి తరంజిత్ సింగ్ సాధు ఈ పురస్కారాన్ని శాన్ఫ్రాన్సిస్కోలో ఆయనకు అందజేశారు.
సుందర్ పిచాయ్ మాట్లాడుతూ ‘భారతదేశం నాలో ఒక భాగం. నేను ఎక్కడికి వెళ్లినా.. దానిని నా వెంట తీసుకువెళ్తాను’ అని పేర్కొన్నారు. అవార్డు అందుకొన్నందుకు గర్వంగా, సంతోషంగా ఉన్నదని పేర్కొన్నారు.