వాషింగ్టన్, డిసెంబర్ 8: అమెరికాలో గ్రీన్కార్డు జారీలో సమూల మార్పులు చోటుచేసుకొనే అవకాశం కనిపిస్తున్నది. ఇప్పటివరకు ఒక్కో దేశానికి కోటా ప్రకారం గ్రీన్కార్డులు జారీచేస్తుండగా, ఇకనుంచి ప్రతిభ ఆధారంగా మాత్రమే కార్డులు జారీచేసే విధానం అమల్లోకి రానుంది. ఇందుకు సంబంధించిన ఈక్వల్ యాక్సెస్ టు గ్రీన్ కార్డ్స్ ఫర్ లీగల్ ఎంప్లాయ్మెంట్ (ఈగిల్) యాక్ట్ -2022 బి ల్లుపై అమెరికా దిగువసభలో ఈ వారమే ఓటింగ్ జరుగనున్నది. ఈ బిల్లుకు అధ్యక్ష భవనం వైట్హౌస్ కూడా సానుకూలంగా ఉన్నది. బిల్లు పార్లమెంటులో ఆమోదం పొ ందితే చట్టంగా మారినట్టే. ఈ బిల్లు చ ట్టంగా మారితే దశాబ్దాలుగా వస్తున్న దే శాల కోటాకు ముగింపు పడుతుంది.
భారతీయులకే ఎక్కువ మేలు
గ్రీన్ కార్డుల జారీలో దేశాల కోటాను రద్దుచేస్తే అధికంగా లాభపడేది భారతీయులేనని సమాచారం. చైనా నుంచి గట్టిపోటీ ఉన్నప్పటికీ సాఫ్ట్వేర్ వంటి రంగాల్లో భారతీయుల హవానే కొనసాగుతున్నది. దీంతో ప్రతిభ ఆధారంగా గ్రీన్కార్డులు జారీచేస్తే అత్యధికం భారతీయ అమెరికన్లకే దక్కుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ‘వలసదారులకు వీసాల జారీలో ఉన్న ప్రతిబంధకాలను తొలగించి వ్యవస్థను సరళీకరించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ప్రయత్నిస్తున్నది. అమెరికా కంపెనీలు విదేశీ ఉ ద్యోగులను వారు పుట్టిన స్థలం ఆధారం గా కాకుండా వారి ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసుకొనేందుకు మార్గం సుగమం చేయటమే ఈగిల్ ఉద్దేశం’ అని వైట్హౌస్ ప్రకటించింది.