బెర్లిన్, జనవరి 16: ఉక్రెయిన్-రష్యా యుద్ధం మరింత విస్తరించి మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందని జర్మనీ ఆందోళన చెందుతున్నది. ఈమేరకు జర్మనీ స్థానిక వార్తా పత్రిక ‘బిల్డ్’ తాజాగా వెలువరించిన వార్తా కథనం సంచలనం రేపింది. జర్మనీ రక్షణ శాఖకు చెందిన రహస్య పత్రాల్లోని కీలక సమాచారం ఆధారంగా ఈ కథనం ప్రచురించినట్టు ‘బిల్డ్’ తెలిపింది. ఈ కథనం ప్రకారం, వచ్చే ఏడాది నాటో కూటమి దేశాలను రష్యా టార్గెట్ చేస్తుందని, ఇది మూడో ప్రపంచ యుద్ధానికి ఆరంభమవుతుందని జర్మనీ ఆందోళన వ్యక్తం చేసింది.