థాయ్లాండ్లోని లోప్బురి చౌరాస్తా. వందలాది కోతులు రెండు గుంపులుగా రోడ్ల మీదకు వచ్చాయి. ఓ గుంపులో కోతులు ఏదో అరిచాయి. సమాధానంగా మరో గుంపు అరిచింది. అంతే.. ఒక గుంపుపై మరో గుంపు విరుచుకుపడింది. కోతులన్నీ తమ ప్రత్యర్థి గుంపులో ఉన్న కోతులపై ముష్ఠిఘాతాలు కురిపించాయి. రక్తం వచ్చేలా రక్కాయి. కోతుల మధ్య గ్యాంగ్ వార్తో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ వార్ లోప్బురిలోని ప్రసిద్ధ బౌద్ధక్షేత్రం వద్ద జరిగింది. కరోనా ఆంక్షల కారణంగా పర్యాటకుల రావడం తగ్గి కోతులకు ఆహారం కరువైంది. ఇదే కొట్లాటకు దారితీసింది.