హైదరాబాద్ : అమెరికా- ఇజ్రాయెల్ దళాలు దేశవ్యాప్తంగా తీవ్ర దాడులను కొనసాగిస్తున్నందున ఇరాన్(Iran) అధికారులు దివంగత సుప్రీం నాయకుడు అయతుల్లా అలీ ఖమేనీ(Khamenei) అంత్యక్రియల కార్యక్రమాన్ని వాయిదా వేశారు. టెహ్రాన్ ప్రార్థనా సముదాయంలో మూడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో జనం వచ్చే అవకాశం ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఇస్లామిక్ డెవలప్ మెంట్ కోఆర్డినేషన్ కౌన్సిల్ అధినేత మోహిసిన ఇరాన్ ప్రభుత్వ మీడియాకు వెల్లడించారు.
ఇందుకు కావాల్సిన మౌలిక సదుపాయాలను సిద్ధం చేయాల్సిన అవసరం ఉందని అంత్యక్రియల తేదీలను త్వరలో వెల్లడిస్తామని వారు తెలిపారు. ఇప్పటికే ఖమేనీ జన్మించిన మషాద్ పట్టణంలో పూడ్చేందుకు భౌతికకాయాన్ని తరలించారు. బుధవారం అంత్యక్రియలు జరుగుతాయని తొలుత ప్రకటించినా చివరి నిమిషంలో వాయిదా వేశారు.