ఫ్రాన్స్ దేశం కొత్త కరోనా వేవ్ ఎదుర్కొంటోందని ఆ దేశ వ్యాక్సినేషన్ చీఫ్ అలెన్ పిషర్ వెల్లడించారు. స్థానిక టీవీ ఛానెల్కు బుధవారం నాడు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్లో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నట్లు ఫిషర్ తెలిపారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లలో మళ్లీ మాస్కులు తప్పనిసరి చేయాలనేది తన అభిప్రాయమని అన్నారు.
‘‘ఇక్కడ ముఖ్యమైన ప్రశ్న ఒకటే.. ఈ కొత్త వేవ్ ఎంత తీవ్రంగా ఉండబోతోంది?’’ అని ఫిషర్ ఆందోళన వ్యక్తం చేశాడు. మిగతా యూరోపియన్ దేశాల్లో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఒమిక్రాన్ సబ్వేరియంట్లు బీఏ.4, బీఏ.5 చాలా వేగంగా పెరుగుతున్నట్లు సమాచారం. ఈ వేరియంట్లు సాధారణ ఒమిక్రాన్ కన్నా వేగంగా వ్యాపిస్తున్నట్లు నిపుణులు చెప్తున్నారు. కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు చేస్తున్నారు.