లాహోర్: పాకిస్థాన్లో మరోసారి క్రూరత్వం బయటపడింది. నలుగురు మహిళల్ని కొందరు దారుణంగా చితకబాదారు. బట్టలు ఊడదీసి మరీ పైశాచికత్వాన్ని ప్రదర్శించారు. నలుగురు మహిళల్లో ఓ టీనేజ్ అమ్మాయి కూడా ఉంది. పంజాబ్ ప్రావిన్సులోని ఫైసలాబాద్లో ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో పంజాబ్ పోలీసులు అయిదుగుర్ని అరెస్టు చేశారు. ఫైసలాబాద్లోని బాబా చౌక్ మార్కెట్లో ఓ షాపులోకి ఎంటర్ అయిన నలుగుర్ని మహిళల్ని ఆ షాపు ఓనర్ చితకబాదారు. వస్తువులు దొంగలించేందుకు వచ్చినట్లు అనుమానించిన ఆ షాపు యాజమాని మరికొంత మందితో కలిసి ఆ మహిళలపై దాడి చేశారు. కర్రలతో కొట్టారు. బట్టలు ఊడదీసి మరీ చితకబాదారు. సుమారు గంట పాటు మార్కెట్ వీధిలో నగ్నంగా ఊరేగించారు. శరీరంపై కప్పుకోవడానికి బట్టలు ఇవ్వండి అంటూ ఆ మహిళలు వేడుకున్నా.. ఏమాత్రం కనికరం చూడకుండా కొట్టారు.