పెషావర్: పాకిస్థాన్(Pakistan) సెక్యూర్టీ దళాలు నలుగురు ఉగ్రవాదులను హతమార్చాయి. ఖైబర్ ఫక్తున్వా ప్రావిన్సులో ఈ ఆపరేషన్ చేపట్టారు. ఇంటెలిజెన్స్ ఆధారంగా ఉగ్రవాదుల ఏరివేత జరిగినట్లు మిలిటరీ తెలిపింది. డేరా ఇస్మాయిల్ ఖాన్ జిల్లాలో సోమవారం ఈ ఘటన జరిగింది. ఓ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు సమాచారం రావడంతో.. భద్రతా దళాలు ఆ ప్రాంతానికి వెళ్లాయి. అక్కడ మిలిటెంట్లు, దళాల మధ్య తీవ్ర ఫైరింగ్ జరిగింది. కాల్పుల్లో చనిపోయిన ఉగ్రవాదులు.. అనేక ఉగ్ర కార్యకలాపాల్లో పాల్గొన్నట్లు తెలుస్తోంది. ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్ధాలను భారీగా స్వాధీనం చేసుకున్నారు. టుర్బత్లో ఉన్న సిద్దికీ నావల్ ఎయిర్ బేస్పై జరిగినదాడిలో ఉగ్రవాదుల్ని కాల్చివేశారు. ఫ్రంటైర్ కార్ప్స్ బలోచిస్తాన్ సైనికుడు కూడా ఒకరు మరణించారు. బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి చెందిన మజీద్ బ్రిగేడ్ ఈ దాడిలో పాల్గొన్నట్లు తెలుస్తోంది.