Australia | ఆస్ట్రేలియా (Australia)లో విషాదం చోటు చేసుకుంది. బీచ్కు వెళ్లిన నలుగురు భారతీయులు (Four Indians) నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. విక్టోరియా (Victoria) రాష్ట్రంలోని ఫిలిప్ ఐలాండ్కు చెందిన బీచ్ (Philip Island beach) వద్ద బుధవారం మధ్యాహ్నం సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
నీటిలో మునిగిపోతున్న నలుగురిని గుర్తించిన స్థానికులు కాపాడేందుకు ప్రయత్నించగా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ముగ్గరు మరణించారు. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న మరొకరిని ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ముగ్గురు హహిళలు. ఈ ఘటనపై కాన్బెర్రాలోని భారత హై కమిషన్ స్పందించింది. ఘటనకు గానూ విచారం వ్యక్తం చేసింది. ఈ మేరకు మృతుల కుటుంబాలకు ప్రగాఢసానుభూతి తెలియజేసింది.
Also Read..
Golden Tiger | అరుదైన గోల్డెన్ టైగర్ ఫొటో షేర్ చేసిన అస్సాం సీఎం.. పిక్ వైరల్
Gold Mine | మాలీలో ఘోర ప్రమాదం.. బంగారు గని కూలి 70 మంది మృతి
Shaitaan Teaser | చేతబడి కాన్సెప్ట్తో వస్తున్న అజయ్ దేవగన్.. ఆసక్తికరంగా ‘సైతాన్’ టీజర్