Cheistha Kochhar | లండన్, మార్చి 25: ప్రతిష్ఠాత్మక లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్లో పీహెచ్డీ చదువుతున్న నీతి ఆయోగ్ మాజీ ఉద్యోగి చేష్ఠా కొచ్చర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. యూనివర్సిటీ నుంచి ఇంటికి సైకిల్పై తిరిగి వస్తుండగా ట్రక్కు ఢీకొట్టింది.
గత ఏడాది గురుగ్రామ్ నుంచి లండన్ వచ్చిన 33 ఏండ్ల కొచ్చర్ బిహేవియరల్ సైన్స్లో పీహెచ్డీ చేస్తున్నారు. మార్చి 19న సాయంత్రం ఫారింగ్డన్ రోడ్డు జంక్షన్ సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం సంభవించింది. కొచ్చర్ నీతి ఆయోగ్లో లైఫ్ైస్టెల్ ఫర్ ది ఎన్విరాన్మెంట్ కార్యక్రమంలో పనిచేశారని నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాంబ్ కాంత్ ఎక్స్ ఖాతాలో తెలిపారు. మృతురాలి భర్త ప్రశాంత్ గౌతమ్ సాఫ్ట్వేర్ ఇంజినీర్. అతనితో కలిసి కొచ్చర్ లండన్కు వెళ్లింది.