లండన్: లండన్లో జరుగుతున్న జీ-7 విదేశాంగ మంత్రుల సమావేశంలో కరోనా కలకలం సృష్టించింది. భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్తో పాటు వెళ్లిన ప్రతినిధి బృందంలో ఇద్దరికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. అయితే, వారు ఆరోగ్యంగానే ఉన్నారని అధికారవర్గాలు తెలిపాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా షెడ్యూల్లో కొన్ని మార్పులు చేశారు. జీ-7 విదేశాంగ మంత్రుల భేటీలో ప్రత్యక్షంగా పాల్గొనాల్సిన జయశంకర్ వర్చువల్ మాధ్యమంగా పాల్గొని ప్రసంగిస్తారన్నారు.