ఖాట్మండు: నేపాల్ రాజధాని ఖాట్మండులోని త్రిభువన్ ఎయిర్పోర్టులో విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. దాదాపు రెండు గంటల నుంచి విమానాలు రాకపోకలు ఆగిపోయాయి. ఇమ్మిగ్రేషన్ సర్వర్లో సమస్యలు తలెత్తడంవల్లే అంతర్జాతీయ విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని ఎయిర్పోర్టు అధికారులు తెలిపారు.
ఎయిర్పోర్టులోని ఇమ్మిగ్రేషన్ సర్వర్లో సమస్యలు తలెత్తాయని, దాంతో విమానాలు ఎక్కడికక్కడే ఆగిపోయాయని త్రిభువన్ ఎయిర్పోర్టు చీఫ్ ప్రేమ్నాథ్ ఠాకూర్ చెప్పారు. విమానాల రాకపోకలను పునరుద్ధరించేందుకు దాదాపు రెండు గంటల నుంచి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నామని ఆయన తెలిపారు. ఇమ్మిగ్రేషన్ సర్వర్ పనిచేయకపోవడంవల్ల అంతర్జాతీయ సర్వీసులు ఆగిపోయాయన్నారు.